పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : త్రిపురాసుర సంహారము

  •  
  •  
  •  

7-407-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు నిజమాయా విశేషంబున మర్త్యలోకంబున విడంబించుచున్న విష్ణుని పరాక్రమవిధానంబులు మునిజన వంద్యమానంబు లై సకల లోక కల్యాణ ప్రధానంబు లై యుండు" ననిన విని నారదునకు ధర్మనందనుం డిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; నిజ = తన; మాయ = మాయ; విశేషంబునన్ = అతిశయముచేత; మర్త్య = మానవ; లోకంబునన్ = లోకమున; విడంబించుచున్న = విరాజిల్లుతున్న; విష్ణుని = విష్ణుమూర్తి యొక్క; పరాక్రమ = పరాక్రమ; విధానంబులు = గతులు; ముని = మునులైన; జన = వారిచే; వంద్యమానంబులు = మొక్కబడినవి; ఐ = అయ్యి; సకల = సమస్తమైన; లోక = లోకములకు; కల్యాణ = మంగళ; ప్రధానంబులు = కలిగించెడివి; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; అనినన్ = అనగా; విని = విని; నారదున్ = నారదుని; కున్ = కి; ధర్మనందనుండు = ధర్మరాజు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:

ఇలా తన మాయా విశేషాలతో విష్ణుమూర్తి మానవలోకంలో విరాజిల్లు తున్నాడు. ఆ శ్రీహరి పరాక్రమ గతులు మునిజనులకు స్తుతిపాత్రాలు. లోక కల్యాణ కారకాలు.” అని నారదుడు ధర్మరాజునకు తెలియజెప్పాడు. అపుడు ధర్మరాజు ఇలా అన్నాడు.