పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : త్రిపురాసుర సంహారము

  •  
  •  
  •  

7-406-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తృణకణముల భంగి ద్రిపురంబుల దహించి
రముఁ డవ్యయుండు ద్రయశుఁడు
శివుఁడు పద్మజాది జేగీయమానుఁ డై
నిజనివాసమునకు నెమ్మిఁ జనియె.

టీకా:

తృణ = గడ్డి; కణముల = పోచల; భంగిన్ = వలె; పురంబులన్ = పురములను; దహించి = కాల్చేసి; పరముడు = శ్రేష్ఠుడు; అవ్యయుండు = నాశములేనివాడు; భద్రయశుడు = శుభకీర్తిగలవాడు; శివుడు = పరమశివుడు; పద్మజ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగువారిచే; జేగీయమానుడు = స్తుతింపబడినవాడు; ఐ = అయ్యి; నిజనివాసమున్ = తనతావు (కైలాసము)న; కున్ = కు; నెమ్మిన్ = ప్రీతితో; చనియె = వెళ్ళెను.

భావము:

అగ్ని దేవుడు ఎండుగడ్డిని దహించినంత సుళువుగా; శాశ్వతుడు, భద్రయశుడు అయిన పరమేశ్వరుడు త్రిపురాలను కాల్చివేశాడు; పద్మసంభువు డైన బ్రహ్మదేవుడు మున్నగువారి పూజ లందుకుని తన నివాసమైన కైలాసానికి వెళ్ళాడు.