పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : త్రిపురాసుర సంహారము

  •  
  •  
  •  

7-391-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"చక్రాయుధ బలయుతు లగు
క్రాదుల కోహటించి శ్రమమున నసురుల్
క్రోధంబున నరిగిరి
విక్రమములు మాని మయుని వెనుకకు నధిపా!

టీకా:

చక్రాయుధ = విష్ణుమూర్తి యొక్క; బల = ప్రాపు, అండ; యుతులు = కలిగినవారు; అగు = అయిన; శక్ర = ఇంద్రుడు {శక్రుడు - దుష్టులను శిక్షించుట యందు శక్తిగలవాడు, ఇంద్రుడు}; ఆదులకున్ = మొదలగువారికి; ఓహటించి = ఓడి; శ్రమమునన్ = కష్టములో; అసురుల్ = రాక్షసులు; సక్రోధంబునన్ = కోపముతోటి; అరిగిరి = వెళ్ళిరి; విక్రమములు = ఎదుర్కొనుటలు; మాని = వదలి; మయుని = మయుని; వెనుక = చాటున, ప్రాపున; కున్ = కు; అధిప = రాజా.

భావము:

ఒకసారి చక్రము ఆయుధముగా కలిగిన శ్రీమహావిష్ణువు అండతో విజృంభిస్తున్న ఇంద్రుడు మొదలైనవారి ఉద్ధృతికి తట్టుకోలేక దానవులు ఓడి భయపడిపోయారు. దానవులకు కోపం వలన మనస్సులు మండిపోయాయి, కానీ దేవతలను ఎదుర్కోలేకపోయారు. వెళ్ళి మయాసురుని వెనుక చేరారు.