పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుడు స్తుతించుట

  •  
  •  
  •  

7-353-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున నల్పుఁడ సంస్తుతి
గావించెద వెఱపు లేక లనేరుపునన్;
నీ ర్ణనమున ముక్తికిఁ
బోవు నవిద్యను జయించి పురుషుఁ డనంతా!

టీకా:

కావునన్ = కనుక; అల్పుడ = చిన్నవాడను; సంస్తుతి = స్తోత్రములు; కావించెద = చేసెదను; వెఱపు = బెదురు; లేక = లేకుండగ; కల = కలిగినంత; నేరుపునన్ = సామర్ధ్యముతో; నీ = నీ యొక్క; వర్ణనమునన్ = స్తుతించుటవలన; ముక్తి = మోక్షపదమున; కిన్ = కు; పోవున్ = వెళ్ళును; అవిద్యన్ = అవిద్యను; జయించి = జయించి; పురుషుండు = మానవుడు; అనంతా = నారాయణా {అనంతుడు - అంతము లేనివాడు, హరి}.

భావము:

శాశ్వతుడా! శ్రీహరీ! మానవుడు కేవలం నీ గుణాలను కీర్తించటం ద్వారా అవిద్యను జయించి కైవల్యాన్ని అందుకుంటాడు కదా. కనుక, నేను అల్పుడను. కొద్దిపాటి జ్ఞానమే నాకున్నా, బెదరకుండా నా నేర్పుకొలది స్తుతిస్తున్నాను. నా ప్రార్థన మన్నించు.