పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : శబళాశ్వులకు బోధించుట

  •  
  •  
  •  

6-248-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్షున కా కాలంబున
క్షితమై యుండెఁ బెక్కు లాగుల నుత్పా
క్షోభంబులు వానికి
రూక్షవ్యధ నొంది యా పురుష నాశంబున్.

టీకా:

దక్షున్ = దక్షుని; కు = కి; ఆ = ఆ; కాలంబున = సమయములో; లక్షితము = ఎదురుపడినవి; ఐ = అయ్యి; ఉండెన్ = ఉండెను; పెక్కు = అనేక; లాగుల = రకముల; ఉత్పాత = ఉపద్రవముల; క్షోభంబులు = కల్లోలములు; వాని = వాటి; కి = కి; రూక్ష = తీక్షణమైన; వ్యధన్ = బాధను; ఒంది = పొంది; ఆ = ఆ; పురుష = పురుష ప్రయత్నమునకు కలిగిన; నాశంబున్ = నాశనమును.

భావము:

దక్షప్రజాపతికి ఆ సమయంలో అనేక విధాలైన అపశకునాలు గోచరించాయి. తన కుమారులు ప్రజాసృష్టికి పరాఙ్ముఖులయ్యారని తెలుసుకున్నాడు. అతని మనస్సు అధికమైన వ్యథతో క్షోభించింది.