పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : అజామిళోపాఖ్యానము

  •  
  •  
  •  

6-94-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మ్మివిరి మీఁద వ్రాలిన
తుమ్మెద పంక్తియును బోలెఁ దోరపు లీలం
గ్రమ్ముకొని విప్రతనయుని
నెమ్మొగమునఁ గానబడియె నెఱిమీసంబుల్.

టీకా:

తమ్మి = పద్మము; విరి = పూవుల; మీద = పైన; వ్రాలిన = వాలినట్టి; తుమ్మెద = తుమ్మెదల; పంక్తియును = వరుసల; పోలెన్ = వలె; తోరపు = వత్తైన; లీలన్ = విధముగ; క్రమ్ముకొని = గుమిగూడి; విప్ర = బ్రాహ్మణ; తనయుని = పుత్రుని; నెఱి = నిండైన; మొగమునన్ = మోమునందు; నెఱి = అందమైన; మీసంబుల్ = మీసములు.

భావము:

తామరపుష్పం మీద వ్రాలిన తుమ్మెదల బారులాగా ఆ బ్రాహ్మణ కుమారుని నెమ్మోముపై అందమైన మీసాలు క్రమ్ముకొని వచ్చాయి.