పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : అజామిళోపాఖ్యానము

  •  
  •  
  •  

6-74-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దాసీభర్త నజామిళ
భూసురుఁ దత్తనువువలన బోరన వెలికిం
దీసిన యమభటులఁ దొలఁగఁ
ద్రోసిరి శ్రీవరుని కూర్మిదూతలు కడిమిన్.

టీకా:

దాసీ = దాసీదాని యొక్క; భర్త = భర్త యైనట్టి; అజామిళ = అజామిళుడు యనెడి; భూసురున్ = బ్రాహ్మణుని {భూసురుడు - భూమికి సురుడు (దేవుడు), బ్రాహ్మణుడు}; తత్ = ఆ; తనువు = శరీరము; వలన = నుండి; బోరనన్ = శ్రీఘ్రమే; వెలికిన్ = బయటకు; తీసిన = తీసినట్టి; యమభటులన్ = యమభటులను; తొలగన్ = తొలగిపోవునట్లు; త్రోసిరి = తోసివేసిరి; శ్రీవరుని = విష్ణుమూర్తి యొక్క {శ్రీ వరుడు - శ్రీ (లక్ష్మీదేవి) యొక్క వరుడు (భర్త), హరి}; కూర్మి = ఇష్ట; దూతలు = సేవకులు; కడిమిన్ = పరాక్రమముతో.

భావము:

దాసీ భర్త అయిన ఆ బ్రాహ్మణుని శరీరం నుండి ప్రాణాలను బయటికి గుంజుతున్న యమభటులను విష్ణుదూతలు బలవంతంగా త్రోసి పడవేశారు.