పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : అజామిళోపాఖ్యానము

  •  
  •  
  •  

6-185-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వ్వరు సిద్ధ సాధ్య ఖచరేశ లసత్పరిగీత గాథలం
దెవ్వరు ముక్తిభోగతల హేమ మనోహర చంద్రశాలలం
దెవ్వరు శంఖచక్ర గురుహేతి గదా రుచిరోగ్రపాణు లా
వ్వపు రూపవంతు లసమానులు పో ధరలోని వైష్ణవుల్.

టీకా:

ఎవ్వరు = ఎవరు; సిద్ధ = సిద్ధుల; సాధ్య = సాధ్యుల; ఖచర = ఆకాశగమనుల; ఈశ = దేవతలచే; లసత్ = తళుక్కు మనెడి; పరి = చక్కటి; గీత = గేయములు; గాధలు = కథలు; అందు = లో; ఎవ్వరు = ఎవరు; ముక్తి = మోక్షము యనెడి; భోగ = భోగించెడి; తల = తలము యొక్క; హేమ = బంగారపు, శ్రేష్ఠమైన; మనోహర = మనోహరమైన; చంద్రశాలలు = చంద్రకాంతశాలలు; అందు = లో; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గురు = పెద్ద; హేతి = ఖడ్గము; గదా = గదలు; రుచిర = కాంతివంతమైన; ఉగ్ర = భయంకరమైన; పాణులు = చేతు లందు ధరించినవారు; ఆ = ఆ; మవ్వపు = సుకుమారమైన; రూపవంతులు = అందమైనవారు; అసమానులు = సాటిలేనివారు; పో = తిరుగులేదు; ధర = లోకము; లోని = అందలి; వైష్ణవుల్ = విష్ణుభక్తులు.

భావము:

విష్ణుభక్తుల కీర్తిని సిద్ధులు, సాధ్యులు, ఖేచరులు లలిత గీతాలతో గానం చేస్తుంటారు. ఆ భాగవతులు ముక్తిసౌధంలోని అందమైన చంద్రశాలల్లో నివసిస్తూ ఉంటారు. సాటిలేనివారు, సౌందర్యవంతులు అయిన ఆ వైష్ణవుల అరచేతులలో శంఖ చక్ర గదా ఖడ్గ రేఖలు విరాజిల్లుతూ ఉంటాయి.