పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : అజామిళోపాఖ్యానము

  •  
  •  
  •  

6-158-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రయఁ బుత్రోపచారిత మైన విష్ణు
నామ మవసానకాలంబును భజించి
శార్ఙ్గి నిలయంబుఁ జేరె నజామిళుండు
నిట్లు సద్భక్తిఁ దలఁచిన నేమిజెప్ప?

టీకా:

అరయన్ = తరచి చూసిన; పుత్ర = కుమారుని యందు; ఉపచారితము = వాడబడినది; ఐన = అయిన; విష్ణు = నారాయణుని; నామము = నామమును; అవసానకాలముననున్ = మరణ సమయమున; భజించి = స్మరించి; శార్ఙ్గి = నారాయణుని; నిలయంబున్ = నివాసమును; చేరెన్ = చేరగలిగెను; అజామిళుండు = అజామిళుడు; ఇట్లు = ఈ విధముగ; సద్భక్తిన్ = మంచి భక్తితో; తలచినన్ = స్మరించినచో; ఏమిచెప్ప = ఏమి చెప్పవలెను.

భావము:

మరణకాలంలో అజామిళుడు తన కుమారుని పేరు పెట్టి పిలిచి విష్ణునామాన్ని ఉచ్చరించిన కారణంగా హరి సాన్నిధ్యాన్ని చేరగలిగాడు. ఇక భక్తితో భగవంతుని నామాన్ని పలికితే చెప్పే దేమున్నది?