పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : అజామిళోపాఖ్యానము

  •  
  •  
  •  

6-157-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పాంవవంశపావన! నృపాలక! యీ యితిహాస మెవ్వఁడే
నొండొక భక్తి లేక విను నోర్పుమెయిం బఠియించు నాతఁ డు
ద్దంత ముక్తికామినికిఁ దానకమై దనుజారిలోకమం
దుండు మహావిభూతి యమదూతల చూడ్కికగోచరాకృతిన్.

టీకా:

పాండవవంశ = పాండవవంశమును; పావన = పవిత్రము చేసినవాడ; నృపాలక = రాజా {నృపాలకుడు - నృ (నరులను) పాలకుడు, రాజు}; ఈ = ఈ; ఇతిహాసమున్ = ఇతిహాసమును; ఎవ్వడేని = ఏవరైనాసరే; ఒండొక = వేరొక దాని పైన; భక్తి = శ్రద్ద; లేక = లేకుండగ; వినున్ = వినునో; ఓర్పు = ఓర్పు; మెయిన్ = కొద్దీ; పఠియించున్ = చదువునో; ఆతడు = అతడు; ఉద్దండత = గట్టిగా; ముక్తి = ముక్తి యనెడి; కామిని = స్త్రీ; కిన్ = కి; తానకము = స్థానము; ఐ = అయ్యి; దనుజారి = నారాయణుని {దనుజారి - దనుజుల (రాక్షసుల)కి అరి (శత్రువు), విష్ణువు}; లోకము = లోకము; అందున్ = లో; ఉండు = ఉండును; మహా = గొప్ప; విభూతిన్ = వైభవముతో; యమదూతల = యమదూతల; చూడ్కి = చూపుల; కిన్ = కి; అగోచర = కనపడని; ఆకృతిన్ = రూపుతో.

భావము:

పాండవ వంశాన్ని పవిత్రం చేసే పరీక్షిన్మహారాజా! ఈ ఇతిహాసాన్ని ఎవడైనా సరే ఏకాగ్రచిత్తంతో విన్నా, చదివినా అతడు ముక్తికాంతకు నెలవై యమదూతలకు కనబడని రూపంతో విష్ణులోకంలో మహావైభవంతో ఉంటాడు.