పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : అజామిళోపాఖ్యానము

  •  
  •  
  •  

6-133-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీన్నారాయణ పద
తారసధ్యానసలిల ధౌత మహాఘ
స్తోముండై సద్భక్తికి
ధామం బగుచుండెఁ దెలిసి త్క్షణమాత్రన్.

టీకా:

శ్రీమత్ = శుభకరమైన; నారాయణ = విష్ణుమూర్తి యొక్క; పద = పాదములనెడి; తామరస = పద్మముల యెడలి; ధ్యాన = ధ్యానము యనెడి; సలిల = మంచినీటిచే; ధౌత = ప్రక్షాళన చేయబడిన; మహా = గొప్ప; అఘ = పాపముల; స్తోముండు = సమూహము గలవాడు; ఐ = అయ్యి; సత్ = మంచి; భక్తి = భక్తి; కిన్ = కి; ధామంబు = నివాసము; అగుచుండెన్ = అగుతుండెను; తెలిసి = ఉద్దేశపూర్వకముగా; తత్క్షణమాత్రన్ = ఆ క్షణము నందే.

భావము:

శ్రీమన్నారాయణుని పాదపద్మాల స్మరణమనే నిర్మలజలంతో తన పాపాలన్నిటినీ కడిగికొని ఆ క్షణం నుండి తనలో నిశ్చలమైన విష్ణుభక్తిని నిలుపుకున్నాడు.