పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : అజామిళోపాఖ్యానము

  •  
  •  
  •  

6-131-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిలిచి కేలు మొగిచి లుక నుద్యోగించి
చెలఁగుచున్న లోనిలఁపు దెలిసి
క్రధరుని కూర్మి హచరు లరిగి ర
దృశ్యు లగుచు దేవదేవు కడకు.

టీకా:

నిలిచి = నిలబడి; కేలు = చేయి; మొగిచి = మోడ్చి; పలుకన్ = చెప్పుటకు; ఉద్యోగించి = ప్రయత్నించి; చెలగుచున్న = చెలరేగుతున్న; లోని = లోపలి; తలపు = ఆలోచనలు; తెలిసి = తెలిసికొని; చక్రధరుని = నారాయణుని {చక్రధరుడు - చక్ర (చక్రాయుధమును) ధరుడు (ధరించువాడు), విష్ణువు}; కూర్మి = ఇష్ట; సహచరులు = సేవకులు; అరిగిరి = వెళ్ళిరి; అదృశ్యులు = అదృశ్యమైనవారు; అగుచున్ = అగుచు; దేవదేవు = నారాయణుని {దేవదేవుడు - దేవతలకే దేవుడు, విష్ణువు}; కడకు = వద్దకు.

భావము:

ఆ అజామిళుడు నిలబడి చేతులెత్తి నమస్కరించి ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. విష్ణుభటులు అతని మనస్సులోని భావాన్ని తెలుసుకొని అంతర్ధానం చెంది ఆ దేవదేవుని సన్నిధికి వెళ్ళిపోయారు.