పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : అజామిళోపాఖ్యానము

  •  
  •  
  •  

6-130-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తఁడును బాశచ్యుతుఁడై
భయుఁడై ప్రకృతినొంది డునుత్సవ సం
తిఁ జూచి మ్రొక్కి మదిలో
తులిత ముద మొదవి పొదలి రిదాసులకున్.

టీకా:

అతడునున్ = అతడు కూడ; పాశ = పాశము; చ్యుతుడు = వీడిన, పడిపోయిన వాడు; ఐ = అయ్యి; గత = పోయిన; భయుడు = భయము గలవాడు; ఐ = అయ్యి; ప్రకృతిన్ = స్వస్థతను; ఒంది = పొంది; కడున్ = మిక్కిలి; ఉత్సవ = ఉత్సాహము; సంగతిన్ = కూడి; చూచి = చూసి; మ్రొక్కి = నమస్కరించి; మదిన్ = మనసు; లోన్ = లో; అతులిత = సాటిలేని; ముదము = సంతోషము; ఒదవి = పొంది; పొదలి = అతిశయించి; హరి = నారాయణుని; దాసులు = సేవకుల; కున్ = కు.

భావము:

ఆ అజామిళుడు యమపాశాలనుండి బయటపడి భయం తొలగిపోగా ధైర్యాన్ని పొంది ఎదుట ఉన్న విష్ణుదూతలకు ఎంతో ఆనందంతో నమస్కరించాడు.