పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : అజామిళోపాఖ్యానము

  •  
  •  
  •  

6-124-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తిపాపములకుఁ బ్రత్న పూర్వకముగఁ-
నుపాపముల కమితంబు గాఁగ
న్ముని వరులచే సంప్రోక్తమై యుండు-
నిర్మలం బగు పాప నిష్కృతములు
గ్రమరూపమున నుపమనంబులగుఁ గాని-
త్పాపచయములు రువ లేవు;
ర్వకర్మంబుల సంహార మొనరించి-
చిత్తంబునకుఁ దత్త్వసిద్ధి నొసఁగు

6-124.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నొనర నీశు సేవ, యోగిమానస సరో
వాసు సేవ, హేమవాసు సేవ,
వేదవేద్యు సేవ, వేదాంత విభు సేవ,
రమపురుష పాదద్మ సేవ.

టీకా:

అతి = మిక్కిలి; పాపముల = పాపముల; కున్ = కు; ప్రయత్నపూర్వకముగన్ = కావాలని చేసిన; తనుపాపముల = పెద్ద పాపముల; కున్ = కు; అమితముగా = మిక్కిలిగా; కాగ = అగునట్ల; సత్ = మంచి; ముని = మునులలో; వరుల = ఉత్తముల; చేన్ = చేత; సంప్రోక్తము = ఉపదేశింపబడినవి; ఐ = అయ్యి; ఉండు = ఉండెడి; నిర్మలంబు = స్వచ్ఛమైనవి; అగు = అయిన; పాప = పాపములను; నిష్కృతములు = ప్రాయశ్చిత్తములు; క్రమరూపమునను = క్రమక్రమముగా; ఉపశమనంబులు = ఉపశమనము నిచ్చునవి; అగున్ = అగును; కాని = కాని తత్ = ఆ; పాప = పాపముల; చయములున్ = సమూహములను; తరువ = తరింప, దాటించ; లేవు = లేవు; సర్వ = సమస్తమైన; కర్మంబులన్ = కర్మలను; సంహారము = నాశనము; ఒనరించి = చేసి; చిత్తంబున్ = మనసు; కున్ = కు; తత్త్వ = పరతత్త్వ; సిద్ధి = సిద్ధిని; ఒసగు = కలుగజేయును; ఒనరన్ = చక్కగా; ఈశు = భగవంతుని; సేవ = భక్తి.
యోగిమానససరోవాసు = నారాయణుని {యోగి మానస సరోవాసుడు - యోగి (యోగుల యొక్క) మానస (మనసు లనెడి) సరః (సరస్సు లందు) వాసుడు (నివసించెడివాడు), విష్ణువు}; సేవ = భక్తి; హేమవాసు = నారాయణుని {హేమ వాసుడు - బంగారు అంబరములను ధరించువాడు, విష్ణువు}; సేవ = భక్తి; వేదవేద్యు = నారాయణుని {వేద వేద్యుడు - వేదములచే వేద్యుడు (తెలియబడువాడు), విష్ణువు}; సేవ = భక్తి; వేదాంతవిభు = నారాయణుని {వేదాంత విభుడు - వేదాంతములు (ఉపనిషత్తాదులు) యందలి విభుడు (ప్రభువు), విష్ణువు}; సేవ = భక్తి; పరమపురుష = నారాయణుని {పరమ పురుషుడు - సర్వమునకు పరమైన పురుషుడు, విష్ణువు}; పాద = పాదము లనెడి; పద్మ = పద్మముల; సేవ = భక్తి.

భావము:

పెద్ద పాపాలకు పెద్ద ప్రాయశ్చిత్తాలను, చిన్న పాపాలకు చిన్న ప్రాయశ్చిత్తాలను మహానుభావులైన మునులు నిర్ణయించి ఉంచారు. కాని ఆ ప్రాయశ్చిత్తాల వల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమిస్తాయి తప్ప పూర్తిగా పరిహారం కావు. సమస్త పాపాలను సంపూర్ణంగా సంహరించి మనస్సును పరిశుద్ధం చేయాలంటే భగవంతుని సేవ ఒక్కటే సరియైన త్రోవ. ఆ పరమేశ్వరుణ్ణి, ఆ యోగిమానస వాసుణ్ణి, ఆ బంగారు వస్త్రాలు ధరించు వాణ్ణి, ఆ వేదవేద్యుణ్ణి, ఆ వేదాంత ప్రభువును, ఆ పురుషోత్తముణ్ణి స్మరిస్తూ ఆయన పాదాలు సేవిస్తే మోక్షం లభిస్తుంది.