పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : అజామిళోపాఖ్యానము

  •  
  •  
  •  

6-100-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కవనై పదనూపుర
రవ లాగుబ్బుకొన్న తిపతి గతులం
జిచివనై విటు చెవులకు
ళిన్ రతిసల్పు రతుల వరవ గనియెన్.

టీకా:

కవకవను = కవకవ మని ధ్వనించునవి; ఐ = అయ్యి; పదనూపుర = కాలిగజ్జలు; రవరవలు = ధ్వనులు; ఆగుబ్బుకొన్న = అతిశయించుతున్న; రతిపతి = మన్మథ; గతులన్ = క్రీడలో; చివచివన్ = చివచివలాడెడిది; ఐ = అయ్యి; విటు = విటుని; చెవులు = చెవుల; కున్ = కు; రవళిన్ = చిరుశబ్దముతో; రతిన్ = సంగమించుటను; సల్పు = సలిపెడి; రతుల = అనురాగపు; రవరవన్ = స్పర్ధను; కనియెన్ = కాంచెను.

భావము:

ఆమె కాలి అందెలు ఘల్లు ఘల్లుమని ఒకదానితో ఒకటి పోటీపడి ధ్వనిస్తున్నాయి. ఆ అందెల చప్పుళ్ళు విటునికి వీనుల విందుగా వినిపిస్తున్నవి. ఇలా ఒకరిపైకి ఒకరు ఎగబడి సాగిస్తున్న సంభోగ చమత్కారాలను అజామిళుడు చూశాడు.
“కవకవ”, “రవరవ”.... ధ్వన్యనుకరణ పదాలుపైన; “క”, “వ”, “ర” అక్షరాల వృత్యనుప్రాసతో అలంకరించి; శృంగారరసం చిక్కగా అల్లిన సహజ కవి పోతన్న గారికి పాదాభివందనాలు...