పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : కథా ప్రారంభము

  •  
  •  
  •  

6-49-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హివు గల కుడుపు మఱి రు
గ్వితులఁ బొడమంగ నీని విధమున నతి స
ద్వ్రతుఁ డైనవాఁడు నిర్మల
తిచే నఘరాశి నెల్ల ట్టము జేయున్.

టీకా:

హితవు = ఇష్టము; కల = కలిగినట్టి; కుడుపు = ఆహారము; మఱి = ఇంక; రుగ్వితతులన్ = రోగముల సమూహములను; పొడమంగనీని = పుట్టనీయని; విధమునన్ = అట్లు; అతి = మిక్కిలి; సత్ = మంచి; వ్రతుడు = నియమనిష్ఠలుగలవాడు; ఐన = అయినట్టి; వాడు = వాడు; నిర్మల = స్వచ్ఛమైన; మతిన్ = మనసుచేత; అఘ = పాపపు; రాశిని = సమూహము; ఎల్లన్ = సమస్తమును; మట్టము = నాశనము; చేయున్ = చేసివేయును.

భావము:

హితకరమైన భోజనం రోగాలను పారద్రోలి మానవునకు ఆరోగ్యాన్ని కలిగించిన విధంగా పెద్దల ఉపదేశానుసారం సత్ప్రవర్తనను అలవరచుకొన్నవాడు నిర్మలమైన హృదయం కలిగి పాపాల నన్నింటినీ పటాపంచలు చేసుకొంటాడు.