పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : కథా ప్రారంభము

  •  
  •  
  •  

6-38-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీమణీ రమణ కథా
పారాయణ చిత్తుఁడగుచుఁ లికెఁ బరీక్షి
ద్భూమణుఁ డాదరంబున
సూరిజనానందసాంద్రు శుకయోగీంద్రున్.

టీకా:

శ్రీరమణీరమణ = నారాయణుని {శ్రీరమణీ రమణుడు - శ్రీరమణీ (లక్ష్మీదేవి) రమణుడు (భర్త), విష్ణువు}; కథా = కథలను; పారాయణ = పారాయణ చేసెడి {పారాయణము - నిష్ఠగా పూని ఒక పూజా కార్యక్రమము వలె చదువుట}; చిత్తుడు = మనసు గలవాడు; అగుచున్ = అవుతూ; పలికెన్ = అనెను; పరీక్షిత్ = పరీక్షుత్తు యనెడి; భూరమణుడు = మహారాజు {భూరమణుడు - భూమికి రమణుడు (భర్త), రాజు}; ఆదరమునన్ = ఆదరముతో; సూరి = జ్ఞానులైన; జన = వారి; ఆనంద = ఆనందమును; సాంద్రు = మిక్కిలి కలిగించు వాడు; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రున్ = ఇంద్రుని వంటివానిని.

భావము:

“లక్ష్మీపతి అయిన శ్రీహరి కథలను పారాయణం చేసే మనస్సు కలిగిన పరీక్షిన్నరేంద్రుడు పండితులకు ఆనందాన్ని కలిగించే శుకమహర్షితో ఇలా అన్నాడు.