పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : కృతిపతి నిర్ణయము

  •  
  •  
  •  

6-24-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుట్టిననాఁటనుండియును, బుట్టద యెట్టియ దట్టు నైనఁ జేఁ
ట్టి నుతింపఁ జిత్తము శుభం బగు మద్వరవాక్యసీమకుం
ట్టము గట్టినాఁడ హరిఁబాయక తత్కథనామృతంబు నే
నుట్టిపడంగఁ జెప్పుదు బుధోత్తము లానుఁడు శ్రోత్రపద్ధతిన్.

టీకా:

పుట్టిన = జన్మించిన; నాట = దినము; నుండియున్ = నుండికూడ; పుట్టద =కలుగదు; ఎట్టిది = ఎటువంటి; దట్టునన్ = దంభముతో; ఐనన్ = అయినను; పట్టి = కోరి; నుతింపన్ = పొగడుకొనుటకు; చిత్తము = మనసు; శుభంబున్ = శుభకరము; అగు = అగును; మత్ = నా యొక్క; వాక్యసీమ = కృతి; కున్ = కి; పట్టముగట్టినాడ = లగ్నమైనాడను; హరిన్ = నారాయణుని; పాయక = విడువక; తత్ = అతని; కథ = కథ లనెడి; అమృతంబున్ = అమృతమును; నేను = నేను; ఉట్టిపడంగ = ఊరికారునట్లు; చెప్పుదున్ = చెప్పెదను; బుధ = జ్ఞానులలో; ఉత్తములు = శ్రేష్ఠులు; ఆనుడు = వినండి; శ్రోత్రపద్ధతిన్ = వినవలసిన పద్ధతిలో.

భావము:

పుట్టినప్పుటినుండి ఎటువంటి గర్వాన్ని నే నెరుగను. శ్రీహరిని చేపట్టి కొనియాడితే చిత్తం నిర్మలమౌతుంది. అందుకని రమ్యమైన నా కవితరాజ్యానికి శ్రీహరిని పట్టం గట్టాను. ఆ మధుసూదనుని కథల సుధలు చిందిపడే చందాన చెప్తాను. పండితోత్తములు వీనుల విందుగా గ్రోలండి.