పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : కృతిపతి నిర్ణయము

  •  
  •  
  •  

6-19-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యానతిచ్చు జగన్మాతృ కృపావలోకన సుశ్లోకుండనై యే నొక్క శ్లోకంబు నా క్షణంబ నుడివితి; నది యెట్టి దనిన.

టీకా:

అని = అని; ఆనతిచ్చు = ఆజ్ఞ నిచ్చెడి; జగన్మాతృ = జగన్మాత యొక్క; కృప = దయాకలిత; అవలోకన = చూపులచేత; సుశ్లోకుండను = కవిత్వము చెప్ప గల వాడను; ఐ = అయ్యి; ఏను = నేను; ఒక్క = ఒక; శ్లోకంబున్ = శ్లోకమును; ఆ = ఆ; క్షణంబ = క్షణములోనే; నుడివితిని = చెప్పితిని; అది = అది; ఎట్టిది = ఎటువంటిది; అనినన్ = అనగా.

భావము:

అని ఆజ్ఞాపించిన జగన్మాత కరుణాకటాక్ష వీక్షణం వల్ల కృతార్థుడనై వెంటనే నేనొక శ్లోకాన్ని రచించాను. అది ఇది...