పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : మరుద్గణంబుల జన్మంబు

  •  
  •  
  •  

6-523-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వా డేర్వు రగుచుఁ గుయ్యిడ
నోరి యఱవ కనుచుఁ ద్రుంచె నొక్కక్కని నా
శూరుం డేడ్గురఁ దునుకలు
గా యమున వారు చెడక ఖండితు లయ్యున్.

టీకా:

వాడున్ = వాడు; ఏడ్వురు = ఏడుగురు (7); అగుచున్ = అగుచు; కుయ్యిడన్ = ఏడ్చుచుండగా; ఓరి = ఓరి; అఱవక = అరవకండి; అనుచున్ = అని పలుకుచు; త్రుంచెన్ = నరికెను; ఒక్కక్కనిన్ = ఒక్కొక్కడిని; ఆ = ఆ; శూరుండు = వీరుడు; ఏడ్గురన్ = ఏడుగురు (7) చొప్పున; తునుకలుగా = ముక్కలుగా; రయమునన్ = శ్రీఘ్రమే; వారున్ = వారు; చెడక = మరణించకుండగ; ఖండితులు = నరకబడినవారు; అయ్యున్ = అయినప్పటికిని.

భావము:

ఆ ఏడుగురు బాలురు గొత్తెత్తి బిగ్గరగా అరవసాగారు. “ఓరీ అరవకండి” అంటూ ఇంద్రుడు ఒక్కొక్క బాలుణ్ణి మళ్ళీ ఏడేడు ముక్కలుగా ఖండించాడు. అయినా వాళ్ళు నాశనం కాలేదు.