పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : మరుద్గణంబుల జన్మంబు

  •  
  •  
  •  

6-511-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లికి కటాక్షవీక్షణ వికారములన్ హృదయానురాగ సం
లిత విశేషవాఙ్మధుర ర్జనలన్ లలితాననేందు మం
పరిశోభితామృత విడంబిత సుస్మిత సుప్రసన్నతా
రుచిరప్రదానముల భామిని భర్తమనంబు లోఁగొనెన్.

టీకా:

కలికి = మనోహరమైన; కటాక్ష = కడగంటి; వీక్షణ = చూపులలోని; వికారములన్ = కదలికలచేత; హృదయ = హృదయ మందలి; అనురాగ = ప్రేమతో; సంకలిత = కూడిన; విశేష = విశిష్టమైన; వాక్ = పలుకులు; మధుర = తీయని; గర్జనలన్ = ధ్వనులతో; లలిత = మనోజ్ఞమైన; ఆనన = ముఖము యనెడి; ఇందు = చంద్ర; మండల = మండలముచే; పరి = మిక్కిలి; శోభిత = శోభించుచున్న; అమృత = అమృతమును; విడంబిత = అనుకరించునట్టి; సుస్మిత = చిరునవ్వుతో కూడిన; సుప్రసన్నతా = మంచి ప్రసన్నతతో; ఫల = ఫలములను; రుచిర = మనోహరముగా; ప్రదానములన్ = అందించుటతోను; భామిని = స్త్రీ; భర్తన్ = భర్త యొక్క; మనంబున్ = మనసును; కొనెన్ = వశము చేసికొనెను.

భావము:

ఆ యొక్క దితి తన కడకంటి చూపులతో, అనురాగం పొంగి పొరలే శృంగార చేష్టలతో, చందమామ వంటి అందమైన ముఖంలో చిందే అమృతం వంటి చిరునవ్వులతో, ప్రసన్నమైన ముచ్చట్లతో, అపురూపాలైన సేవలతో మగని మనస్సును లొంగదీసుకొన్నది.