పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : మరుద్గణంబుల జన్మంబు

  •  
  •  
  •  

6-508-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మి కారణమున నింద్రునికిని మరు
చ్చయము లాప్తు లగుచు శాంతి నొంది?
రయఁ దత్సమాను గుచు వర్తించిరి?
దీని వినఁగవలయుఁ దెలుపవయ్య! "

టీకా:

ఏమి = ఏమి; కారణమునన్ = కారణముచేత; ఇంద్రున్ = ఇంద్రుని; కిని = కి; మరుత్ = మరుత్తులు; చయములు = గణములు; ఆప్తులు = ఇష్టులై ; అగుచున్ = అగుచు; శాంతిన్ = శాంతిని; ఒందిరి = పొందిరి; తత్ = అతనికి; సమానులు = సమానమైనవారు; అగుచున్ = అగుచు; వర్తించిరి = ప్రవర్తించిరి; దీని = దీనిని; వినగవలయున్ = వినవలెను; తెలుపు = చెప్పుము; అయ్య = తండ్రి.

భావము:

“ఏ కారణం వల్ల ఇంద్రునికి మరుద్గణాలు ఆప్తులై, శాంతిని పొంది, దేవత్వాన్ని సంపాదింప గలిగారు? ఈ వృత్తాంతాన్ని వినాలనుకుంటున్నాను. అయ్యా! నాకు వినిపించు”.