పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : చిత్రకేతోపాఖ్యానము

  •  
  •  
  •  

6-485-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డించున్ హరి దివ్యనాటక గుణవ్యాపార నృత్యంబులం;
బాడించున్ జలజాతనేత్ర బిరుదప్రఖ్యాత గీతంబులం;
గూడించున్ సతతంబు జిహ్వలతుదిన్ గోవిందనామావళుల్
క్రీడం గిన్నర యక్ష కామినులచేఁ గృష్ణార్పితస్వాంతుఁడై.

టీకా:

ఆడించున్ = ఆడించును; హరి = నారాయణుని; దివ్య = దివ్యమైన; నాటక = నాటకములు; గుణ = గుణములు; వ్యాపార = వర్తనల గురించిన; నృత్యంబులన్ = నృత్యములను; పాడించున్ = పాడించును; జలజాతనేత్ర = నారాయణుని {జలజాతనేత్రుడు - జలజాతము (పద్మముల)వంటి నేత్రములు గలవాడు, విష్ణువు}; బిరుద = వైభవములను తెలిపెడి; ప్రఖ్యాత = ప్రసిద్ధమైన; గీతంబులన్ = పాటలను; కూడించున్ = కలిగించును; సతతంబున్ = ఎల్లప్పుడు; జిహ్వల = నాలుకల; తుదిన్ = చివరల యందు; గోవింద = గోవిందుని; నామ = నామముల; ఆవళున్ = సమూహములను; క్రీడన్ = లీలలుగా; కిన్నర = కిన్నరలు; యక్ష = యక్షులు; కామినుల్ = స్త్రీల; చేన్ = చేత; కృష్ణ = కృష్ణునికి; అర్పిత = సమర్పింపబడిన; స్వాంతుడు = మనసు గలవాడు; ఐ = అయ్యి.

భావము:

చిత్రకేతుడు కిన్నరకాంతల చేత, యక్షకాంతల చేత జగన్నాటక సూత్రధారి అయిన శ్రీహరి దివ్య లీలలను గానం చేయించాడు. నాట్యం చేయించాడు. ఆ పుండరీకాక్షుని నామాలను నిరంతరం నాలుకలపై పలికించాడు. ఈ విధంగా కృష్ణుని యందే లగ్నమైన మనస్సుతో చిత్రకేతుడు ప్రవర్తించాడు.