పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : చిత్రకేతోపాఖ్యానము

  •  
  •  
  •  

6-464-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్నములు హేమములు ననురాగలీల
మ్మకంబుల నీవల నావల నగు
భంగి నరులందు జీవుండు ప్రాప్తుఁ డగుచు
నెలమిఁ దిరుగుచు నుండుఁ; దా నెందుఁ జెడఁడు.

టీకా:

రత్నములున్ = మణులు; హేమములున్ = బంగారు ఆభరణములు; అనురాగ = ఆసక్తుల; లీలన్ = ప్రకారమును; అమ్మకంబులన్ = అమ్మకములతో; ఈవలన = ఇటుపక్క; ఆవలనన్ = అటుపక్క; అగు = అయ్యెడి భంగిన్ = విధముగనే; నరులు = మానవుల; అందు = అందు; జీవుండు = జీవుడు; ప్రాప్తుండు = పొందినవాడు; అగుచున్ = అగుచు; ఎలమిన్ = పొందుతూ; తిరుగుచున్ = తిరుగుతూ; ఉండున్ = ఉండును; తాన్ = తను; ఎందున్ = ఏవిధముగను; చెడడు = పాడైపోడు.

భావము:

రత్నాలు, బంగారు నగలు, మన ఆసక్తివల్ల క్రయవిక్రయాలలో ఏ విధంగా అటూ ఇటూ చేరుతూ ఉంటాయో అదే విధంగా జీవుడు తన కర్మానుసారంగా సంచరిస్తూ ఉంటాడే కాని అతనికి ఏ బంధమూ అంటదు. అతనిలో ఎటువంటి మార్పు ఉండదు.