పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : చిత్రకేతోపాఖ్యానము

  •  
  •  
  •  

6-455-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని తలమొల యెఱుంగక పలవించుచు, భృత్యామాత్య బంధుజనంబులం గూడి యడలుచు నున్న యా రాజు దుఃఖం బెఱింగి, యంగిరసుండు నారదునితోడం గూడి చనుదెంచి, మృతుండైన పుత్రుని పదతలంబున మృతుండునుం బోలెఁ బడియున్న యా రాజుం గనుంగొని, యిట్లనియె

టీకా:

అని = అంటూ; తలమొలయెఱుంగక = తుది మొదలు తెలియకుండా, అంతులేకుండా; పలవించుచు = దుఃఖిస్తూ; భృత్య = సేవకులు; అమాత్య = మంత్రులు; బంధుజనంబులన్ = బంధువు లందరితో; కూడి = కలిసి; అడలుచున్ = రోదిస్తూ; ఉన్న = ఉన్నట్టి; ఆ = ఈ; రాజు = ఏలిక; దుఃఖంబు = దుఃఖమును; ఎఱింగి = తెలిసి; అంగిరసుండు = ముని అంగిరసుడు; నారదుని = నారదమునీశ్వరుని; తోడన్+కూడి = తోసహా; చనుదెంచి = వచ్చి; మృతుండు = మరణించినవాడు; ఐన = అయిన; పుత్రుని = కొడుకు; పద = కాళ్ళ; తలంబున = ప్రాంతమున; మృతుండునున్ = మరణించినవాని; పోలెన్ = వలె; పడియున్న = కూలబడి ఉన్నట్టి; యా; రాజున్ = నరేంద్రుని; కనుంగొని = చూసి; యిట్లు = ఇలా; అనియె = చెప్పెను.

భావము:

అని అంతూపొంతూ లేకుండా దుఃఖిస్తూ సేవకులతో, మంత్రులతో, బంధువులతో కలిసి ఆక్రోశిస్తున్న మహారాజు శోకవృత్తాంతాన్ని తెలుసుకొని అంగిరసుడు నారదునితో పాటు వచ్చి మరణించిన కుమారుని కాళ్ళ దగ్గర నిశ్చేష్టుడై కూలబడి ఉన్న చిత్రకేతును చూచి ఇలా అన్నాడు.