పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : చిత్రకేతోపాఖ్యానము

  •  
  •  
  •  

6-452-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుంకుమరాగ రమ్య కుచకుంభములం గడుఁ గజ్జలంబుతోఁ
బంకిలమైన బాష్పముల పాల్పడ మజ్జన మాచరించుచుం
గంణపాణి పల్లవయుగంబున వక్షము మోఁదికొంచు నా
పంరుహాక్షి యేడ్చెఁ బరిభావిత పంచమ సుస్వరంబునన్.

టీకా:

కుంకుమ = కుంకుమ యొక్క; రాగ = రంగుచే; రమ్య = అందముచెందినట్టి; కుచ = స్తనములు యనెడి; కుంభములన్ = కుంభములు; కడు = మిక్కిలి; కజ్జలంబు = కాటుక; తోన్ = తోటి; పంకిలము = బురద; ఐన = అయినట్టి; బాష్పములన్ = కన్నీటికి; పాల్పడన్ = పాల్పడినట్లు; మజ్జనము = స్నానము; ఆచరించుచున్ = చేయుచుండగ; కంకణ = కంకణములు ధరించిన; పాణి = చేతులు యనెడి; పల్లవ = చిగురుల; యుగంబునన్ = జంటతో; వక్షమున్ = వక్షస్థలమును; మోదికొంచున్ = బాదుకొనుచూ; ఆ = ఆ; పంకరుహాక్షి = స్త్రీ {పంకరుహాక్షి - పంకరుహము(పద్మము) వంటి అక్షి(కన్నులు గలామె), స్త్రీ}; ఏడ్చెన్ = ఆక్రందించెను; పరిభావిత = భంగపాటుతో; సు = చక్కటి; స్వరంబునన్ = గొంతుతో.

భావము:

కుంకుమ పూతతో ఎఱ్ఱనై మిక్కిలి చక్కని వక్షోజాలు కాటుక కన్నీళ్ళతో తడిసి పంకిలం కాగా కృతద్యుతి కంకణాలు ఘల్లుఘల్లుమని మ్రోగగా చిగురాకులవంటి చేతులతో రొమ్ము బాదుకుంటూ కోకిల కంఠస్వరంతో గొంతెత్తి గోడుగోడున ఏడ్చింది.