పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : చిత్రకేతోపాఖ్యానము

  •  
  •  
  •  

6-445-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మిత విభూతిఁ జాల నమరాధిపుఁ బోలుచు శూరసేన దే
ములకు భర్తయై ప్రజలు సంతస మందఁగ సార్వభౌముఁడై
క్ష దమ కెల్ల కాలమును గామ దుహంబుగఁ జిత్రకేతు నా
మునఁ బ్రసిద్ధి కెక్కె గుణమండనుఁ డంచిత కీర్తికాముఁడై.

టీకా:

అమిత = మిక్కిలి; విభూతిన్ = వైభవముతో; చాలన్ = అనేక రకములుగ; అమరాధిపున్ = ఇంద్రుని {అమరాధిపుడు - అమర (దేవతల)కు అధిపుడు (రాజు), ఇంద్రుడు}; పోలుచు = సరితూగుతు; శూరసేన = శూరసేన యనెడి; దేశముల్ = దేశముల; కున్ = కు; భర్త = రాజు; ఐ = అయ్యి; ప్రజలు = పౌరులు; సంతసమున్ = సంతోషమును; అందగన్ = పొందగా; సార్వభౌముడు = చక్రవర్తి; ఐ = అయ్యి; క్షమన్ = భూమి; తమ = తమ; కున్ = కు; ఎల్లకాలమును = ఎల్లప్పుడును; కామదుహంబుగన్ = కామధానువు కాగ; చిత్రకేతు = చిత్రకేతుడు యనెడి; నామమునన్ = పేరుతో; ప్రసిద్ధుడు = ప్రసిద్ధుడు; అయ్యెన్ = అయ్యెను; గుణ = సుగుణములు; మండనుడు = అలంకారముగా గలవాడు; అంచిత = పూజనీయమైన; కీర్తి = యశస్సు; కాముడు = కోరినవాడు; ఐ = అయ్యి.

భావము:

పూర్వం చిత్రకేతువనే మహారాజు అమితమైన ఐశ్వర్యంతో దేవేంద్రునితో సమానుడై, శూరసేన దేశాలకు అధిపతియై, సుగుణ భూషణుడై, యశోవిశాలుడై, ఎల్లవేళలా భూమి తన కోరిన కోరికలను తీరుస్తూ ఉండగా ప్రజారంజకంగా పరిపాలించేవాడు.