పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : నరక లోక విషయములు

  •  
  •  
  •  

5.2-138-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు; నవ్విధంబున బాధితుం డగుచుఁ దామిస్రనరకంబునం బడి యనశనాద్రిపాతన దండతాడన తర్జనాది బాధలం జెంది కడు భయంబున మూర్ఛలం బొందుచుండు.

టీకా:

మఱియునున్ = ఇంకను; ఆ = ఆ; విధంబునన్ = విధముగ; బాధితుండు = బాధింపబడినవాడు; అగుచున్ = అగుచు; తామిస్రంబునన్ = తామిస్రమమునందు {తామిస్రమము - చీకటిలోకము, నరక విశేషము}; పడి = పడి; అనశన = ఆహారములేకపోవుట; అద్రి = కొండపైనుండి; పాతన = పడదోయబడుట; దండ = బెత్తములతో; తాడన = కొట్టుట; తర్జన = బెదిరించుట {తర్జన - తర్జని (చూపుడువేలు)తో బెదిరించుట}; ఆది = మొదలగు; బాధలన్ = బాధలను; చెంది = పొంది; కడు = మిక్కిలి; భయంబునన్ = భయముతో; మూర్ఛలన్ = స్పృహతప్పుటలు; పొందుచునుండున్ = పొందుతుండును;

భావము:

అంతే కాకుండా వారిని తామిస్రం అనే నరకంలో పడవేసి అన్నం పెట్టక, కొండపైనుండి దొర్లిస్తూ, కఱ్ఱతో చావమోదుతూ, బెదరిస్తూ యమకింకరులు నానావిధాలుగా శిక్షిస్తారు. ఆ బాధలకు తాళలేక జీవులు భయకంపితులై మూర్ఛ పోతుంటారు.