పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భగణ విషయము

  •  
  •  
  •  

5.2-91-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రాటముగ రవి సుతునకు
నేకాదశలక్షలను మహీసురులకు నీ
లోకులకు మేలు గోరుచుఁ
జోగ మునిసప్తకంబు సొంపు వహించున్.

టీకా:

ప్రాకటముగ = ప్రసిద్ధముగ; రవిసుతున్ = శని {రవిసుతుడు - రవి (సూర్యుని) సుతుడు (కుమారుడు), శనీశ్వరుడు}; కున్ = కి; ఏకాదశలక్షలను = పదకొండులక్షలలో (11,00,000); మహీసురుల్ = బ్రాహ్మణుల; కున్ = కు; లోకుల్ = లోకులు; కు = కు; మేలు = శుభములను; కోరుచున్ = ఆశించుతూ; జోకగ = జతగా; మునిసప్తకంబున్ = సప్తర్షిమండలము {సప్తర్షులు - 1మరీచి 2అత్రి 3అంగిరసుడు 4పులస్త్యుడు 5పులహుడు 6క్రతువు 7వసిష్ఠుడు అనెడి ఏడుగురు ఋషులు}; సొంపు = చక్కదనము; వహించున్ = కలిగియుండును;

భావము:

శనికి పదకొండు లక్షల యోజనాల దూరంలో సప్తర్షి మండలం ఉంది. ఇందులోని ఋషులు బ్రాహ్మణులకు, ప్రజలకు మేలు కోరుతుంటారు.