పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

  •  
  •  
  •  

5.2-52-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి రామభద్రు నంజనీసుతుఁడు గిం
పురుషగణముఁ గూడి పూజ చేసి
త్ప్రకాశకప్రధాన మంత్రస్తోత్ర
ఠనములను దగ నుప్రాస్తి సేయు.

టీకా:

అట్టి = అటువంటి; రామభద్రున్ = శ్రీరాముని; అంజనీసుతుడు = ఆంజనేయుడు {అంజనీ సుతుడు - అంజనీదేవి యొక్క పుత్రుడు, ఆంజనేయుడు}; కింపురుష = కింపురుషుల; గణమున్ = సమూహముతో; కూడి = కలిసి; పూజ = కొలచుట; చేసి = చేసి; తత్ = అతనిని; ప్రకాశక = ప్రకాశము కలిగించెడు; ప్రధాన = ముఖ్య; మంత్ర = మంత్రములు; స్తోత్ర = స్తుతులను; పఠనములనున్ = చదువుటలను; తగన్ = అవశ్యము; ఉప్రాస్తిజేయు = సేవ చేయును;

భావము:

అటువంటి కింపురుష వర్షంలో అంజనాదేవి కుమారుడైన ఆంజనేయుడు కింపురుష గణాలతో కూడి మహనీయాలైన మంత్ర స్తోత్రాలతో శ్రీరామచంద్రుని ఆరాధిస్తూ ఉంటాడు.