పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

  •  
  •  
  •  

5.2-48-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్షమందు నర్యముఁ
డా ర్షజనంబుగూడి రిఁ జిత్తములో
భావించి సంస్తవంబులు
గావించుచుఁ గాంతు రతని కైవల్యంబున్.

టీకా:

ఆ = ఆ; వర్షము = వర్షము, దేశము; అందున్ = లో; అర్యముడు = అర్యముడు; ఆ = ఆ; వర్ష = దేశ; జనంబున్ = ప్రజలతో; కూడి = కలిసి; హరిన్ = నారాయణుని; చిత్తము = మనసు; లోన్ = లోపల; భావించి = ధ్యానించి; సంస్తవంబులు = స్తోత్రములు; కావించుచున్ = చేయుచు; కాంతురు = పొందెదరు; అతని = అతని యొక్క; కైవల్యంబున్ = కైవల్యమును;

భావము:

ఆర్యముడు ఆ హిరణ్మయ వర్షంలోని జనులతో కలిసి కూర్మరూపుడైన శ్రీహరిని మనస్సులో ధ్యానిస్తూ, సంస్తుతిస్తూ భుక్తి ముక్తులను అందుకుంటాడు.