పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

  •  
  •  
  •  

5.2-33.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుగు లవణసాగరాంతంబులుగ నాల్గు
మోములందు నాల్గు నాములను
న్నుఁ గన్నవారిఁ న వారిఁదోగిన
వారి కెల్ల నమృతవారి యగుచు.

టీకా:

అంతన్ = అంతట; అసంఖ్యంబులున్ = లెక్కలేనన్నివి; ఐన = అయిన; దివ్య = దేవ; విమాన = విమానముల యొక్క; సంకులంబులన్ = సందడులతో; సువిశాలము = మిఖ్కిలి విశాలమైన; దేవ = ఆకాశ; మార్గంబునన్ = దారిలో; దిగివచ్చి = దిగివచ్చి; చంద్రమండలము = చంద్రలోకము; దోచుచున్ = అనిపించుతూ; మేరునగ = మేరుపర్వతము యొక్క; శిఖర = శిఖరము; అగ్రముననున్ = పైన; ఆ = ఆ; బ్రహ్మదేవుని = బ్రహ్మదేవుని; పట్టణమున్ = పట్టణమున; కున్ = కు; వచ్చి = వచ్చి; అందులన్ = దానిలో; జతుర్ = నాలుగు; ద్వారములనున్ = ద్వారములలోను; వరుస = వరుస; తో = ప్రకారము; దీర్ఘ = పెద్ధ; ప్రవాహంబులు = ప్రవాహములు; అగుచునున్ = అగుచు; ప్రవహించి = ప్రవహించి; అమల = స్వచ్ఛమైన; ప్రభావములనున్ = ప్రభావములతో; అరుగున్ = వెళ్ళును, ప్రవహించును;
లవణ = ఉప్పు; సాగర = సముద్రములందు; అంతంబులుగన్ = అంతమగునవి; నాల్గు = నాలుగు; మోములు = వైపుల; అందున్ = అందులోను; నాల్గు = నాలుగు; నామములనున్ = పేర్లతో; తన్ను = తనను; కన్నవారిన్ = దర్శించినవారిని; తన = తన యొక్క; వారిన్ = నీటిలో; తోగిన = స్నానముచేసిన; = వారి = వారి; కిన్ = కి; ఎల్లన్ = అందరకు; అమృతవారి = అమృతవంటి నీరు; అగుచున్ = అగుతూ;

భావము:

విష్ణుమూర్తి పాదంనుండి వినిర్గతమైన ఆకాశగంగ లెక్కలేనన్ని దివ్యవిమానాలతో నిండి సువిశాలంగా ఉండే దేవమార్గం గుండా వచ్చి చంద్రమండలాన్ని ఒరుసుకుంటూ మేరుపర్వత శిఖరాగ్రానికి చేరుకుంటుంది. అక్కడి ఆ బ్రహ్మపట్టణం నాలుగు ద్వారాల గుండా సీత, చక్షువు, భద్ర, అలకనంద అనే నాలుగు పేర్లతో నాలుగు విధాలుగా ప్రవహించి చివరకు లవణ సముద్రంలో కలిసిపోతుంది. ఆ గంగాజలాలు తమను దర్శించే వారికి, తమలో స్నానం చేసేవారికి అమృతత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి.