పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

  •  
  •  
  •  

5.2-23-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నదీజలంబు లాడిన యచ్చటి
యంబికానుచరుల యంగగంధ
మంది పవనుఁ డంత నుజేశ! పది యోజ
ములు జుట్టుఁ బరిమముల నింపు.

టీకా:

ఆ = ఆ యొక్క; నదీ = నదియందు; జలంబులాడిన = స్నానములు చేసిన; అచ్చటి = అక్కడి; అంబికా = పార్వతీదేవి; అనుచరులు = చెలికత్తెలు; అంగ = దేహము లందలి; గంధమున్ = సువాసనలను; అంది = పొంది; పవనుడు = వాయుదేవుడు; అంతన్ = అంతట; మనుజేశ = రాజ {మనుజేశ - మనుజులకు ఈశుడు (ప్రభువు), రాజు}; పది = పది; యోజనములున్ = యోజనముల వరకు; చుట్టున్ = చుట్టుపక్కల; పరిమళములన్ = సువాసనలను; నింపున్ = నింపును.

భావము:

రాజా! ఆ నదీజలాలలో పార్వతీదేవి చెలికత్తెలు స్నానం చేస్తారు. వారి శరీరమందలి దివ్యపరిమళాన్ని గ్రహించిన వాయువు పదివేల యోజనాల పర్యంతం సుగంధాలను వెదజల్లుతుంది.