పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

  •  
  •  
  •  

5.2-18-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూద్మమునకు మేరువు
దీపించుచుఁ గర్ణికాకృతిని బెం పగుచుం
బ్రాపై కులగిరిరాజుగఁ
జూట్టును సురగణాళి చోద్యం బందన్.

టీకా:

భూ = భూమి యనెడి; పద్మంబున్ = పద్మమున; కున్ = కు; మేరువున్ = మేరుపర్వతము, ఇరుసువలె; దీపించుచున్ = ప్రకాశించుతూ; కర్ణిక = బొడ్డు; ఆకృతిన్ = రూపమున; పెంపగుచున్ = అతిశయించుతూ; ప్రాపు = ఆధారము; ఐ = అగుచు; కులగిరి = కుల పర్వతములకు {కులపర్వతములు - ప్రధానపర్వతములు ఇవి (7) - మహేంద్రోమలయస్సహ్యశ్శుక్తిమాన్ గంధమాదనః. వింద్యశ్చపారియాత్రాశ్చసప్తై తే కులపర్వతాః}; రాజుగన్ = రాజువలె; చూపట్టును = కనబడును; సురగణ = దేవతల; అళి = సమూహము; చోద్యంబున్ = ఆశ్చర్యమును; అందన్ = పోవునట్లు.

భావము:

మేరుపర్వతం భూమి పద్మానికి కర్ణిక వలె ప్రకాశిస్తున్నది. కులపర్వతాలకే రాజుగా కనిపిస్తుంది. దానిని చూచి దేవతలంతా ఆశ్చర్యపడతారు.