పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : వర్షాధిపతుల జన్మంబు

  •  
  •  
  •  

5.1-25-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కుం డిట్లు విరక్తుఁడైనను దదాజ్ఞం జేసి యాగ్నీధ్రుఁ డే
పు ధర్మప్రతిపాలనుం డగుచు జంబూ ద్వీపమున్నేలుచుం
సత్పుత్రులమాడ్కి నెల్ల ప్రజలం దాత్పర్య చిత్తంబునన్
తం బ్రోచె ననేకకాల మిలఁ బ్రఖ్యాతంబుగా భూవరా!

టీకా:

జనకుండు = తండ్రి; ఇట్లు = ఈ విధముగ; విరక్తుండు = వైరాగ్యము గలవాడు; ఐననున్ = కాగా; తత్ = అతని; ఆజ్ఞన్ = ఆజ్ఞను; చేసి = వలన; ఆగ్నీధ్రుడ = ఆగ్నీధ్రుడు; ఏపున = అతిశయముతో; ధర్మ = ధర్మమును; ప్రతిపాలనుండు = పరిపాలించువాడు; అగుచున్ = అగుచూ; జంబూద్వీపమున్ = జంబూద్వీపమును; ఏలుచున్ = ఏలుతూ; తన = తన యొక్క; సత్పుత్రుల = మంచి కొడుకులను; మాడ్కిన్ = వలె; ఎల్లన్ = అఖిలమైన; ప్రజలన్ = ప్రజలను; తాత్పర్య = వారి యందు లగ్నమైన; చిత్తంబునన్ = మనసుతో; ఘనతన్ = గొప్పదనముతో; ప్రోచెన్ = కాపాడెను; ఏకకాలము = ఒక సమయమున; ఇలన్ = నేలపైన; ప్రఖ్యాతంబుగాన్ = ప్రసిద్ధముగా; భూవరా = రాజా {భూవరుడు - భూమికి వరుడు (భర్త), రాజు}.

భావము:

“పరీక్షిన్మహారాజా! తండ్రి అయిన ప్రియవ్రతుడు విరక్తుడు కాగా అతని ఆజ్ఞప్రకారం అతని కుమారుడు ఆగ్నీధ్రుడు జంబూద్వీపాన్ని ధర్మమార్గంలో పరిపాలిస్తూ ప్రజలందరినీ కన్నబిడ్డల వలె లాలిస్తూ చాలాకాలం రాజ్యం చేసి ప్రఖ్యాతి గడించాడు.