పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : సింధుపతి విప్ర సంవాదంబు

  •  
  •  
  •  

5.1-169-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హుకుటుంబి యగుచు హుధనాపేక్షచే
నెండమావులఁగని యేగు మృగము
ణిఁ బ్రేమఁజేసి గురువులు వాఱుచు
నొక్కచోట నిలువకుండు నెపుడు.

టీకా:

బహు = పెద్ద; కుటుంబి = కుటుంబము కలవాడు; అగుచున్ = అగుచూ; బహు = మిక్కిలి; ధన = ధనము నందు; ఆపేక్ష = లాలస; చేన్ = చేత; ఎండమావులన్ = ఎండమావులను; కని = చూసి; ఏగు = వెళ్ళెడి; మృగమున్ = జంతువు; కరణి = వలె; ప్రేమన్ = లాలస; చేసి = వలన; గురువులు = పరుగులు; వాఱుచున్ = పెడుతూ; ఒక్క = ఒక; చోటన్ = స్థలములో; నిలువకుండున్ = నిలబడక ఉండును; ఎపుడు = ఎప్పుడు.

భావము:

పెరుగుతున్న కుటుంబాన్ని పోషించుకొనడం కోసం ధనం సంపాదించాలనే ఆరాటంలో ఎండమావుల వెంబడి పరుగెత్తే మృగంలాగా మానవుడు పరుగులు పెడుతూ ఒకచోట నిలువక తిరుగుతూ ఉంటాడు.