పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : సింధుపతి విప్ర సంవాదంబు

  •  
  •  
  •  

5.1-168-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిగి కాననమునఁ గొవిదయ్యముఁ గాంచి
గ్నిఁగోరి వెంట రుగుమాడ్కిఁ
గాంచనంబు గోరి లవారియిండ్ల పం
లను దిరుగు నరుఁడు లనమంది.

టీకా:

మరిగి = అలవాటున; కాననమునన్ = అడవిలోన; కొఱవిదయ్యమున్ = కొఱవిదయ్యమును; కాంచి = చూసి; అగ్నిన్ = నిప్పు; కోరి = కావలెనని; వెంటన్ = వెనుక; అరుగు = వెళ్ళుట; మాడ్కిన్ = వలె; కాంచనంబున్ = బంగారమును; కోరి = కాంక్షించి; కలవారి = ధనవంతుల; ఇండ్ల = నివాసముల యొక్క; పంచలను = గుమ్మముల ముందు; తిరుగు = తిరిగెడి; నరుడు = మానవుడు; చలనమున్ = చలించుటను; అంది = పొంది.

భావము:

అడవిలో రాత్రిపూట కొరవి దయ్యాన్ని చూచి నిప్పుకోసం దాని వెంటబడి తిరిగినట్లు ధనం కోసం భాగ్యవంతుల ఇళ్ళచుట్టూ ఊరకే రాకపోకలు చేస్తూ వ్యథలకు లోనవుతాడు.