పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : సింధుపతి విప్ర సంవాదంబు

  •  
  •  
  •  

5.1-150-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుచు ధారుణీసురాత్మజుఁ డీ రీతి
లుకుటయును రాజు రిణమించి
వినయవాక్యములను వినుతించి క్రమ్మఱఁ
బుణ్యుఁ డైన సింధు భూవరుండు.

టీకా:

అనుచున్ = అనుచూ; ధారుణీసుర = బ్రాహ్మణ; ఆత్మజుడు = పుత్రుడు; ఈ = ఈ; రీతిన్ = విధముగ; పలుకుటయును = చెప్పెను; రాజు = రాజు; పరిణమించి =సంతసించి; వినయ = వినయముగల; వాక్యములను = మాటలతో; వినుతించి = స్తుతించి; క్రమ్మఱన్ = మరల; పుణ్యుండు = పుణ్యాత్ముడు; ఐన = అయినట్టి; సింధు = సింధుదేశపు; భూవరుండు = రాజు.

భావము:

బ్రాహ్మణ కుమారుడైన భరతుడు ఈ విధంగా పలుకగానే రాజులో మార్పు కలిగింది. ఆ తరువాత వినయోక్తులతో స్తుతించి భరతునితో సింధురాజు ఇలా అన్నాడు.