పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : సింధుపతి విప్ర సంవాదంబు

  •  
  •  
  •  

5.1-140-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మనసు కొలఁది నప్పుడు
మునుకొని యట్లప్రయత్నమున నడవఁగ నా
పతి నిమ్నోన్నతమై
నుట యెఱిఁగి శిబిక మోచు నులకు ననియెన్.

టీకా:

తన = తన యొక్క; మనసుకొలది = ఇష్టము వచ్చినట్లు; అపుడున్ = అప్పుడు; మునుకొని = పూని; అట్ల = ఆ విధముగ; అప్రయత్నమునన్ = అప్రయత్నముగా; నడవగాన్ = నడచుచుండగా; ఆ = ఆ; జనపతి = రాజు; నిమ్నోన్నతము = ఎగుడు దిగుడు; ఐ = అయ్యి; చనుటన్ = వెళ్లుటను; ఎఱిగి = తెలిసి; శిబిక = పల్లకీ; మోచు = మోసెడి; జనుల్ = వారి; కున్ = తోటి; అనియెన్ = అనెను.

భావము:

భరతుడు అలవాటు లేక మనసుకు తోచినట్లు ఎంతో ప్రయత్నంతో నడుస్తున్నాడు. పల్లకి ఎగుడు దిగుడుగా ఊగుతుంటే రాజు బోయీలను చూచి ఇలా అన్నాడు.