పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట

  •  
  •  
  •  

4-89-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గఁ జితాస్థిభస్మ నృకపాలజటాధరుఁడుం బరేత భూ
రుఁడు పిశాచయుక్తుఁ డని ర్వు నమంగళుగాఁ దలంప రె
వ్వరు; నొకఁ డీవు దక్క, మఱి వాక్పతి ముఖ్యులు నమ్మహాత్ము స
చ్చణ సరోజ రేణువులు మ్మతిఁ దాల్తురు మస్తకంబులన్.

టీకా:

పరగన్ = ప్రసిద్ధముగ; చితా = చితిపై నున్న; అస్థి = ఎముకలు; భస్మ = భస్మము; నృ = నరుని; కపాల = పుఱ్ఱెలు; జటా = జటలు కట్టిన శిరోజముల; ధరుడు = ధరించువాడు; పరేత = శ్మశాన; భూ = భూమి యందు; చరుడు = తిరుగువాడు; పిశాచ = పిశాచములతో; యుక్తుడు = కూడి యుండువాడు; అని = అని; శర్వున్ = శివుని; అమంగళున్ = అశుభకరుని; కాన్ = అగునట్లు; తలపరు = అనుకొనరు; ఎవ్వరున్ = ఎవరూ; ఒక్కడ = ఒక్కడివి; ఈవు = నీవు; తక్కన్ = తప్పించి; మఱి = మరి; వాక్పతి = బ్రహ్మదేవుడు {వాక్పతి - వాక్కు (సరస్వతీదేవి)కి భర్త, బ్రహ్మదేవుడు}; ముఖ్యులు = మొదలైన ప్రముఖులు; ఆ = ఆ; మహాత్ము = గొప్పవాని; సత్ = మంచి; చరణ = పాదములు అనెడి; సరోజ = పద్మముల; రేణువులు = ధూళిని; సమ్మతి = అంగీకరించి; తాల్తురు = ధరించెదరు; మస్తకంబులన్ = శిరస్సులందు.

భావము:

చితిలోని ఎముకలను, బూడిదను, మానవకపాలాన్ని ధరించి, పిశాచాలతో కూడి శ్మశానంలో తిరిగినా శివుణ్ణి నీవు తప్ప మరెవ్వరూ అమంగళుడని భావించరు. బ్రహ్మ మొదలైనవారు ఆ మహాత్ముని పాదధూళిని తమ శిరస్సులపై సంతోషంతో ధరిస్తారు.