పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట

  •  
  •  
  •  

4-81-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మున మోదమందుచు నుమాతరుణీమణి గాంచె దారు మృ
త్కక కుశాజినాయస నికాయ వినిర్మిత పాత్ర సీమము
న్ననుపమ వేదఘోష సుమత్పశు బంధన కర్మ భూమమున్
మునివిబుధాభిరామము సముజ్జ్వల హోమము యాగధామమున్.

టీకా:

మనమునన్ = మనసులో; మోదమున్ = సంతోషమును; అందుచున్ = చెందుతూ; ఉమా = ఉమ అనెడి; తరుణీ = స్త్రీ లలో {తరుణి - తరుణ వయసునున్నామె, స్త్రీ}; మణి = రత్నములాంటామె; కాంచెన్ = చూసెను; దారు =కొయ్యతోను; మృత్ = మట్టితోను; కనక = బంగారముతోను; కుశ = దర్భలు; అజిన = లేడిచర్మము; అయస = ఇనుము; నికాయ = సమూహముచే; వినిర్మిత = చక్కగ నిర్మింపబడ్డ; పాత్ర = పాత్రలుగల; సీమమున్ = భూమిని; అనుపమ = గొప్ప {అనుపమ - ఉపమానమునకు అందనిది, గొప్ప}; వేద = వేదముల; ఘోష = శబ్దములు; సు = మంచి; మహత్ = గొప్ప; పశు = యజ్ఞపశువుని; బంధన = బంధించిన; భూమమున్ = స్థలమును; ముని = మునులతోను; విబుధ = దేవతలతోను; అభిరామము = చక్కనైనదానిని; సమ = చక్కగా; ఉజ్జ్వల = జ్వలిస్తున్న; హోమము = హోమము కలదానిని; యాగ = యజ్ఞ; ధామమున్ = భూమిని.

భావము:

సతీదేవి మనస్సులో సంతోషిస్తూ యజ్ఞశాలను చూసింది. ఆ యజ్ఞశాలలో కొయ్యతో, మట్టితో, బంగారంతో, లోహంతో చేసిన పాత్రలున్నాయి. దర్భలతో, జింకతోళ్ళతో చేసిన వస్తువులు ఉన్నాయి. వేదఘోషలు మిన్ను ముట్టుతున్నాయి. ఒకచోట యజ్ఞ పశువును బంధించారు. మునులు, దేవతలు తమతమ స్థానాలలో కూర్చుని ఉన్నారు. హోమాలు చేస్తున్నారు. యజ్ఞం వైభవోపేతంగా జరుగుతున్నది.