పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట

  •  
  •  
  •  

4-79.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స్తువులు గొంచు నేగి శర్వాణిఁ గదిసి
శంఖ దుందుభి వేణు నిస్వనము లొప్ప
మానితంబైన వృషభేంద్రయానఁ జేసి
జ్ఞభూమార్గులై యర్థి రిగియరిగి.

టీకా:

మానిని = స్త్రీ {మానిని - మానము గలామె, స్త్రీ}; చనుచుండన్ = వెళ్తుండగ; మణిమత్ = మణిమంతుడు; మద = మదుడు; ఆది = మొదలగువారు; సహస్ర = వేల; సంఖ్యాక = కొలది; రుద్ర = శివుని; అనుచరులు = అనుయాయులు; యక్షులు = యక్షులు; నిర్భయులు = భయము లేనివారు; ఐ = అయ్యి; వృషభేంద్రుని = నందీశ్వరుని; ముందు = ముందట; ఇడుకొనుచు = ఉండుకొని; ఆ = ఆ; ముదిత = స్త్రీ {ముదిత - ముదము (సంతోషమును) ఇచ్చునది, స్త్రీ}; తాల్చు = ధరించు; కందుక = చెండ్లు; అంబుజ = పద్మములు; శారికా = చిలుకలు; తాళవృంత = తాటాకు విసనకర్రలు; దర్పణ = అద్దము; ధవళ = తెల్లని; అతపత్ర = గొడుగు; ప్రసూన = పూల; మాలిక = మాలలు; సౌవర్ణ = బంగారు; మణి = రత్న; విభూషణ = ఆభరణములు; ఘనసార = పచ్చకర్పూరము; కస్తూరిక = కస్తూరి; చందన = గంధము; ఆది = మొదలైన.
వస్తువులు = సామాను; కొంచున్ = తీసుకొని; ఏగి = వెళ్ళి; శర్వాణిన్ = సతీదేవిని {శర్వాణి - శర్వుని భార్య, సతి}; కదిసి = చేరి; శంఖ = శంఖము; దుందుభి = దుందుభి; వేణు = వేణువుల; నిస్వనములు = శబ్దములు; ఒప్పన్ = ఒప్పునట్లు; మానితంబు = గౌరవింపదగినది; ఐన = అయిన; వృషభేంద్రుని = నందీశ్వరునిపై; యానన్ = ప్రయాణించు దానిని; చేసి = చేసి; యజ్ఞ = యజ్ఞము జరుగు; భూ = ప్రదేశమునకు వెళ్ళు; మార్గులు = మార్గమున పోవువారు; ఐ = అయ్యి; అర్థిన్ = కోరి; అరిగియరిగి = వెళ్ళి.

భావము:

సతీదేవి వెళ్తుండగా మణిమంతుడు మొదలైన వేలకొలది ప్రమథులు, యక్షులు నందీశ్వరుని ముందు పెట్టుకొని బయలుదేరారు. ఆమెకు కావలసిన పూబంతులు, పద్మాలు, గోరువంకలు, విసనకర్రలు, అద్దాలు, వెల్లగొడుగు, పూలదండలు, మణులు కూర్చిన బంగారు నగలు, పచ్చకర్పూరం, కస్తూరి, మంచిగంధం మొదలైన వస్తువులను వెంట తీసుకొని వెళ్ళి ఆమెను కలుసుకున్నారు. సతీదేవిని వృషభవాహనంపై కూర్చుండబెట్టి శంఖాలు, నగారాలు, పిల్లనగ్రోవులు మ్రోగిస్తూ యజ్ఞం జరిగే ప్రదేశంవైపు ప్రయాణం చేసి చేసి...