పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : కర్దమప్రజాపతి వంశాభివృద్ధి

  •  
  •  
  •  

4-25-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారు సినీవాలి యనఁ గు
హూ రాకానుమతు లనఁగ నొప్పిరి; మఱియుం
గో సుత యుగము గలిగెను
స్వారోచిషమనువు వేళ స్తఖ్యాతిన్.

టీకా:

వారు = వారు; సినీవాలి = సినీవాలి {సినీవాలి – అమావాస్యా భేదము, అంతకు ముందు తెల్లవారుఝామున సన్నటి చంద్రరేఖ తూర్పున కనబడు అమావాస్య}; అనన్ = అని; కుహూ = కుహూ {కుహూ – అమావాస్యా భేదము, అంతకు ముందు తెల్లవారుఝామున కూడ చంద్రరేఖ కనబడని అమావాస్య}; రాకా = రాకా {రాకా – పూర్ణిమా భేదము, నిండుపున్నమి, సంపూర్ణ కళలుగల చంద్రునితోగూడిన పౌర్ణమి}; అనుమతులు = అనుమతీలు {అనుమతి – పూర్ణిమా భేదము, ఒక కళ తక్కువైన చంద్రుడుగల పౌర్ణమి}; అనగన్ = అనగా; ఒప్పిరి = తగి యుండిరి; మఱియున్ = మరల; కోరన్ = కోరగా; సుత = కుమారుల; యుగము = ద్వయము (2); కలిగెను = పుట్టిరి; స్వారోచిష = స్వారోచిష యనెడి {స్వారోచిష - స్వ (తనంతతాను) రోచిష (ప్రకాశము కలవాడు)}; మనువు = మనువు యొక్క; వేళ = మన్వంతరమునందు; శస్త = శ్రేష్ఠమైన; ఖ్యాతిన్ = కీర్తితో.

భావము:

సినీవాలి, కుహువు, రాక, అనుమతి అని ఆ నలుగురి పేర్లు. వీరు కాక అంగిరసునికి ఇద్దరు కుమారులు కలిగి, స్వారోచిష మనువు కాలంలో ప్రసిద్ధులయ్యారు.