పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : కర్దమప్రజాపతి వంశాభివృద్ధి

  •  
  •  
  •  

4-24-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంగిరసుఁ డనెడు మునికిఁ గు
లాంన యగు శ్రద్ధ యందు నంచిత సౌంద
ర్యాంగులు గూఁతులు నలువురు
మంళవతు లుదయమైరి మాన్యచరిత్రా!

టీకా:

అంగిరసుడు = అంగిరసుడు; అనెడు = అను; మునికిన్ = మునికి; కులాంగన = భార్య; అగు = అయిన; శ్రద్ధ = శ్రద్ధ; అందున్ = అందు; అంచిత = పవిత్రమైన; సౌందర్యాంగులు = అందగత్తెలు {సౌందర్యాంగులు - సౌందర్యముతో కూడిన అంగములు (అవయవములు) కలవారు}; కూతులు = పుత్రికలు; నలువురు = నలుగురు; మంగళవతులు = శుభలక్షణములు కలవారు; ఉదయమైరి = జన్మించిరి; మాన్యచరిత్రా = గౌరవింపదగిన నడవడిక కలవాడా.

భావము:

మాననీయుడవైన విదురా! విను. అంగిరసుడు అను మునీంద్రునికి భార్యయైన శ్రద్ధయందు సుగుణవతులు, సుందరాంగులు అయిన నలుగురు కుమార్తెలు కలిగారు.