పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : కర్దమప్రజాపతి వంశాభివృద్ధి

  •  
  •  
  •  

4-22-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని మునిచంద్రుఁడు దన మన
మునఁ గామించిన వరంబు బుధవరులు ముదం
బు నొసఁగి యతనిచేఁ బూ
ములఁ బరితృప్తు లగుచుఁ నిరి యథేచ్ఛన్.

టీకా:

అని = అని; మునిచంద్రుడు = మునులలో చక్కనివాడు; తన = తన యొక్క; మనమున = మనసులో; కామించిన = కోరుకున్న; వరంబున్ = వరమును; బుధవరులు = జ్ఞానశ్రేష్ఠులు; ముదంబునన్ = సంతోషముతో; ఒసగి = ఇచ్చి; అతనిన్ = అతని; చేన్ = చేత; పూజనములన్ = పూజింపబడుట యందు; తృప్తులు = తృప్తిచెందినవారు; అగుచున్ = అవుతూ; చనిరి = వెళ్ళిరి; యథేచ్ఛన్ = ఇష్టానుసారము.

భావము:

అని మునీంద్రుడైన అత్రి తన మనస్సులో కోరుకున్న వరాన్ని అనుగ్రహించి, ఆ మహర్షి చేసిన పూజలకు సంతుష్టులై త్రిమూర్తులు యథేచ్ఛగా వెళ్ళిపోయారు.