పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : కర్దమప్రజాపతి వంశాభివృద్ధి

  •  
  •  
  •  

4-21-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మా మువ్వుర యంశంబుల
ధీమంతులు సుతులు పుట్టి త్రిభువనములలో
నీ మంగళగుణకీర్తిన్
శ్రీహితము చేయఁగలరు; సిద్ధము సుమ్మీ."

టీకా:

మా = మా; మువ్వుర = ముగ్గురి యొక్క; అంశంబులన్ = అంశలతోను; ధీమంతులు = బుద్ధిబలము గలవారు; సుతులు = పుత్రులు; పుట్టి = జన్మించి; త్రిభువనముల = ముల్లోకముల; లోన్ = అందు; నీ = నీ యొక్క; మంగళ = శుభ; గుణ = గుణముల; కీర్తిన్ = కీర్తిని; శ్రీ = గొప్పదనముతో; మహితము =వాసికెక్కినదిగా; చేయగలరు = చేయగలరు; సిద్ధము = నిక్కము; సుమ్మీ = సుమా.

భావము:

మా ముగ్గురి అంశలతో బుద్ధిమంతులైన ముగ్గురు కుమారులు నీకు జన్మిస్తారు. వారు మంగళమయమైన నీ కీర్తిని మూడులోకాలలో వ్యాపింప జేస్తారు. ఇది జరిగి తీరుతుంది.”