పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : కర్దమప్రజాపతి వంశాభివృద్ధి

  •  
  •  
  •  

4-14-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునుకొని యత్తపోధనుని మూర్ధజమైన తపః కృశాను చే
ను ద్రిజగంబులుం గరఁగి ప్తము లైనను జూచి పంకజా
మురశాసనత్రిపురశాసను లచ్చటి కేఁగి రప్సరో
సుర సిద్ధ సాధ్య ముని న్నుత భూరియశోభిరాములై.

టీకా:

మునుకొని = పూనుకొని; ఆ = ఆ; తపోధనుని = తపస్సు అను ధనము కలవాని; మూర్ధజమైన = శిరస్సున పుట్టినట్టి; తపస్ = తపస్సు యొక్క; కృశాను = కృశానువు, అగ్ని; చేతను = వలన; త్రిజగములున్ = ముల్లోకములును; కరగి = కాగి; తప్తములు = కాలినవి; ఐనను = కాగా; చూచి = చూసి; పంకజాసన = బ్రహ్మదేవుడు {పంక జాసనుడు - పంకజము (నీట పుట్టినది, పద్మము) యందు ఆసనుడు (ఉండువాడు), బ్రహ్మదేవుడు}; మురశాసన = విష్ణుమూర్తి {ముర శాసనుడు - ముర యను రాక్షసుని శాసించినవాడు, నారాయణుడు}; త్రిపురశాసనులు = శివుడును {త్రిపుర శాసనుడు - త్రిపురములను కూల్చినవాడు, శంకరుడు}; అచ్చటికిన్ = అక్కడికి; ఏగిరి = వెళ్ళిరి; అప్సరస్ = అప్సరసలు; జన = సమూహము; సుర = దేవతలు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; ముని = మునులతో; సన్నుత = చక్కగా స్తోత్రము చేయబడుతున్న; భూరి = అత్యధికమైన {భూరి - సంఖ్యాలలో 1 తరువాత 34 సున్నాలతో చాల పెద్దది అదే కోటియాతే 7 సున్నాలే ఉంటాయి, అత్యధికమైన}; యశో = కీర్తితో; అభిరాములు = ప్రకాశించువారు; ఐ = అయ్యి.

భావము:

ఆ అత్రిమహాముని శిరస్సునుండి వెలువడిన అగ్నిజ్వాలలచేత మూడులోకాలు కరిగి వేడెక్కగా చూచి అప్సరసలు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, మునులు తమ యశస్సును గానం చేస్తుండగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అతని దగ్గరకు వెళ్ళారు.