పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పురంజను కథ

  •  
  •  
  •  

4-843-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"హా! రనాథ! హా! సుమహితాత్మక! హా! గుణశాలి! యింక నం
భోనిధి మేఖలాకలిత భూమి యధార్మిక రాజ చోర పీ
డా నిరతిం గృశింప నకటా! తగునయ్య యుపేక్షచేయ; శో
భాయశాలి! నీవు పరిపాలన చేయుదు, లెమ్ము భూవరా!"

టీకా:

హా = అయ్యో; నరనాథ = రాజా; హా = అయ్యో; సు = మంచి; మహిత = గొప్ప; ఆత్మక = మనసు కలవాడ; హా = అయ్యో; గుణశాలి = సుగుణ స్వభావములు కలిగినవాడ; ఇంకన్ = మరి; అంభోనిధి = సముద్రము; మేఖల = సరిహద్దులుగా; కలిత = కలిగిన; భూమిన్ = నేలను; అధార్మిక = వేదధర్మ విరుద్దులైన; రాజ = రాజుల; చోర = దొంగల; పీడన్ = బాధవలన; నిరతిన్ = నిరంతరము; కృశింపన్ = చిక్కిపోగా; అకటా = అయ్యో; తగునా = తగినదా; అయ్యా = నాయనా; ఉపేక్షన్ = అలక్ష్యము; చేయన్ = చేయుట; శోభానయశాలి = శుభకరమైన నేర్పరితనము కలవాడ; నీవున్ = నీవు; పరిపాలన = చక్కగ పాలించుట; చేయుదు = చేసెదవుగాని; లెమ్ము = లే; భూవర = రాజ.

భావము:

“ఓ రాజా! ఓ మహాత్మా! ఓ సద్గుణమూర్తీ! దొంగలైన క్షత్రియాధముల పీడచేత కృశించిన భూమండలాన్ని రక్షించకుండా ఉపేక్షించడం నీకు తగదు. లేచి వచ్చి రక్షించు”