పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పురంజను కథ

  •  
  •  
  •  

4-841-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విను మూష్మత లేకున్నను
ని యూథభ్రష్ట హరిణి కైవడి సతి నె
మ్మమున బెగడుచు దీనత
యంబును బంధురహిత యై శోకించెన్.

టీకా:

విను = వినుము; ఊష్మతన్ = వేడి; లేకున్ననున్ = లేకపోవుటను; కని = చూసి; యూథ = గుంపునుండి; భ్రష్ట = చెదిరిపోయిన; హరిణి = ఆడులేడి; కైవడి = వలె; సతి = స్త్రీ; నెఱి = అత్యధికముగ; మనమునన్ = మనసు; బెగడుచున్ = బెదిరిపోతూ; దీనతన్ = దీనత్వమునందు; అనయంబునున్ = మరలమరల; బంధు = బంధువులు; రహిత = (దగ్గర) లేనిది; ఐ = అయ్యి; శోకించెన్ = దుఃఖించెను.

భావము:

వేడి లేకపోవటం గమనించి గుంపునుండి తప్పిపోయిన లేడిలాగా భయపడుతూ విలపించింది.