పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పురంజను కథ

  •  
  •  
  •  

4-830.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లైన కొడుకుల నేడ్వుర ర్థిఁ గనియె
వారలకు నెల్ల నొక్కొక్క రుస నర్బు
దార్బుద సుతులు సంజాతు లైరి; యతని
సుత ధృతవ్రత నా యగస్త్యుఁడు వరించె.

టీకా:

అవనీశ = రాజా {అవనీశుడు - అవని (భూమి)కి ఈశుడు, రాజు}; వీర్య = పరాక్రమమే; పణా = వెలగా; ఆత్త = కొనబడినది; ఐన = అయిన; అట్టి = అటువంటి; వైదర్భిని = విదర్భరాజుకూతురును; మలయకేతనుడు = మలయకేతనుడు {మలయకేతనుడు - మలయ (విష్ణుభక్తి ప్రధానముగా కల దక్షిణ దేశము) అందు కేతనుడు (శ్రేష్టుడు)}; అనంగన్ = అనెడి; పర = శత్రువుల, ఇతరుల; పురన్ = పురములను; జయుడు = జయించెడివాడు; ఐన = అయిన; పాండ్య = పాండ్యదేశపు {పాండ్యభూమీశుడు - పండా (నిశ్చయబుద్ధి) కలవాడు (పాండ్యుడు) వారిదేశము పాండ్యము, పాండ్యదేశపురాజు, మలయకేతనుడు}; భూమీశుండు = రాజు {భూమీశుడు - భూమికి ప్రభువు, రాజు}; దారుణ = దారుణమైన; సంగర = యుద్ద; స్థలమున్ = భూమి; అందున్ = లో; శక్తిన్ = బలముతోటి; అనేక = అనేకమైన; రాజ = రాజులు; అన్యులన్ = ఇతరులను; నిర్జించి = ఓడించి; పరిణయంబున్ = వివాహము; అయ్యెన్ = చేసికొనెను; ఆ = ఆ; గురు = మిక్కిలి; భుజుండున్ = భుజబలముకలవాడు; ఆ = ఆ; విదర్భ = విదర్భుని; ఆత్మజన్ = పుత్రికను; అందున్ = అందు; అసిత = నల్లని {అసితేక్షణ - నల్లని కన్నులుకలామె, అసిత (నల్లనివాడైన కృష్ణుని యందు) ఈక్షణ చూపుకలామె), కృష్ణునిసేవించుట యందు రుచికలామె}; ఈక్షణ = కన్నులుకలామె; ఐన = అయిన; కూతున్ = పుత్రికను; ద్రవిడ = ద్రవిడదేశపు {ద్రవిడాధినాథులైననేడ్వురు వీర్యుని కొడుకులు - శ్రవణము కీర్తనము మొదలైన ఏడువిధములైన భక్తిమార్గములు}; అధినాథులు = రాజులు; ఐన = అయినట్టి.
కొడుకులన్ = కుమారులను; ఏడ్వురన్ = ఏడుగురిని (7); అర్థిన్ = కోరి; కనియెన్ = పుట్టించెను; వారల్ = వారి; కున్ = కి; ఎల్లన్ = అందరకు; ఒక్కొక్క = ఒక్కొక్కరికి; వరుసన్ = వరుసగా; అర్బుదార్భుద = అనేకమైన {అర్బుదార్బుదములు - క్షితి (1 తరవాత 20సున్నాలు) అర్బుదము (1 తరువాత 10సున్నాలు, వేయికోట్లు) అనేకము}; సుతులు = కుమారులు; సంజాతులు = పుట్టినవారు; ఐరి = అయిరి; అతనిన్ = అతనియొక్క; సుత = కుమార్తె (లోపాముద్ర); ధృతవ్రతన్ = వ్రతదీక్షకలామెను; ఆ = ఆ; అగస్త్యుడు = అగస్త్యుడు {అగస్త్యుడు - మనస్సునకు సంకేతము}; వరించెన్ = వివాహమాడెను.

భావము:

రాజా! పాండ్యరాజైన మలయధ్వజుడు యుద్ధంలో ఎందరో రాజులను గెలిచి ఆ విదర్భరాజు పుత్రికను వీర్యశుల్కంగా పొందాడు. ఆమెవల్ల అతనికి ఒక కుమార్తె, ఏడుగురు కుమారులు కలిగారు. ఆ కుమారులకు ఒక్కొక్కరికి పదికోట్లమంది కొడుకులు జన్మించి ద్రవిడ దేశాన్ని నేర్పుతో పరిపాలించారు. మలయధ్వజుని కుమార్తె ధృతవ్రత (లోపాముద్ర) అగస్త్యుని వరించింది.